Thursday, May 9, 2024

అంతర్జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బాలల హక్కులు, ఆరోగ్యం, భద్రత కోసం ప్రత్యేక చర్యలు….

ఇటీవలే నీలోఫర్ హాస్పిటల్ లో ప్రత్యేక శిశు విహార్ వార్డు ప్రారంభం….

ఖమ్మంలో ప్రత్యేకంగా మాతా శిశు కేంద్రం…..

Happy International Children's Day

ఖమ్మం: పిల్లలు దేవుడి ప్రతి రూపాలు… నిష్కల్మశమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనాలు… ప్రేమకు పాత్రులు..ఇలాంటి చిన్నారుల హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, బాల్యాన్ని పిల్లలు ఆనందంగా, అద్భుతంగా గడిపేలా దోహదపడాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  నవంబర్ 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా చిన్నారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బాలల హక్కుల రక్షణ కల్పనకు, వారి భవితవ్యాన్ని బంగారుమయం చేసేందుకు, వారి భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో బాలల కోసం ప్రత్యేకమైన హోమ్స్, బాలల హక్కుల రక్షణకు, భద్రతకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, బాలల సంక్షేమ కమిటీలు పనిచేస్తున్నాయన్నారు. బాలల ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారానే వారికి బంగారు భవితవ్యాన్ని ఇవ్వగలమని నమ్మిన ప్రభుత్వం వారి ఆరోగ్యం కోసం పుట్టినప్పటి నుంచి అంగన్వాడీల ద్వారా ఆరోగ్య లక్ష్మీ, బాలామృతం వంటి పోషకాహారాలు అందిస్తోందన్నారు. గురుకులాల్లో సమతుల సంపూర్ణ ఆహారాన్ని అందించడం ద్వారా వారి మానసిక వికాసానికి కృషి చేస్తోందని ఆయన తెలిపారు.  ఇటీవలే నిలోఫర్ హాస్పిటల్ లో ప్రత్యేకంగా శిశువిహార్ వార్డు కూడా ప్రారంభించడం ద్వారా ఈ రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణకు ఈ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో తెలియజేసిందని పువ్వాడ వివరించారు.

ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రసవించిన చిన్నారులకు ప్రత్యేక ఆసుపత్రినే ఏర్పాటు చేశామని, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో బాలల కోసం ప్రత్యేక కోవిడ్ వార్డు ను ఏర్పాటు చేయడమైందన్నారు.  వారి సంరక్షణ తెలంగాణ ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరోసారి చిన్నారులకు అంతర్జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News