Monday, April 29, 2024

ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మల్లన్న ప్రాజెక్టు పూర్తి చేశాం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని, కరోనాతో బయట పడి ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని మల్లన్న దేవుడిని కోరినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఆదివారం కొమురవెల్లి మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో అతి పెద్ద 50 టీఏంసీల సాగునీటి ప్రాజెక్టును మల్లన్న సాగర్ పేరిట పూర్తి చేసుకున్నాం. మల్లన్న దేవుడి దయతో ఆశీస్సులతో కొన్ని నెలల క్రితం 10 టీఏంసీల నీళ్లు నింపుకోవడం జరిగింది. సీఎం కేసీఆర్ భగవత్ భక్తుడు. రాష్ట్రంలో జరప తలపెట్టిన అన్నీ ప్రాజెక్టులకు, అన్నీ కార్యక్రమాలకు భగవంతుని పూజించి మొదలు పెడుతున్నాం. కాబట్టే ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, అడ్డంకులు పెట్టినా, నిర్వాసితులను రెచ్చగొట్టి నిర్మాణ పనులు ఆపినా..కొమురవెళ్లి మల్లన్న దేవుడి దయతో సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేశాం. దీంతో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. గతేడాది ప్రాజెక్టు పూర్తి కావాలని మల్లన్న దేవుడిని మొక్కుకుని వెళ్ళాం. కొమురవెళ్లి మల్లన్న ఆలయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చాలా అభివృద్ధి చేశాం. 7 ఏళ్లలో రూ.30కోట్లతో కొమురవెళ్లి ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గతేడాది 3 వెండి దర్వాజలు చేస్తామని చెప్పి, పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొమురవెళ్లి మల్లన్న కోసం అద్భుతమైన బంగారు కిరీటం చేయించాలని సంకల్పించారు. వచ్చే యేడాది మల్లన్న కల్యాణోత్సవం వరకు పూర్తి చేసి మల్లన్నకు బంగారు కిరీటం పెడతాం” అని పేర్కొన్నారు.

Harish Rao offer pattu vastralu to Komuravelli Mallanna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News