- Advertisement -
న్యూఢిల్లీ: ఆలిండియా కోటా కింద 2020-21 సంవత్సరానికి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డెంటల్ కోర్సులలో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసిన మెడికల్ సీట్లలో 50 శాతం సీట్లను ఓబిసిలకు కేటాయించకూడదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవలసిందిగా మద్రాసు హైకోర్టును సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. తమ వద్ద పెండింగ్లో ఇదే తరహా కేసు ఉన్నప్పటికీ దానికి అతీతంగా తమిళనాడు ప్రభుత్వం, మరికొందరు వేసిన పిటిషన్లపై ఓబిసి కోటాపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. వీడియో లింక్ ద్వారా సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది.
HC decision on OBC quota in medical seats: Supreme
- Advertisement -