Saturday, May 4, 2024

లవ్ స్టోరీలు తగ్గిద్దామని అనుకున్నా

- Advertisement -
- Advertisement -

నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల రూపొందించిన చిత్రం ‘భీష్మ’. ఈనెల 21న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా హీరో నితిన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
మూడు సంవత్సరాల ముందే చేసుకోవాల్సింది…
నిజం చెప్పాలంటే నా పెళ్లి చాలా ఆలస్యంగా జరుగుతోంది. మూడు సంవత్సరాలు ముందే నేను పెళ్లి చేసుకోవాల్సింది. కానీ నేను మానసికంగా సిద్ధం కావడానికి కొంత సమయం పట్టింది.
చాలా సమయం తీసుకున్నాడు…
‘శ్రీనివాస కళ్యాణం’ షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు వెంకీ కుడుముల ‘భీష్మ’ స్టోరీ లైన్ చెప్పాడు. ఆ తరువాత ఆ లైన్‌ను ఫుల్ స్క్రిప్ట్‌గా డెవలప్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. అందుకే ఒక సంవత్సరం ఆలస్యంగా సినిమాని మొదలు పెట్టాము.
ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు…
సినిమా అంతా లవ్ స్టోరీ, రొమాన్స్, కామెడీనే ఉంటుంది. అయితే ఆర్గానిక్ లేయర్‌లో ఆ లవ్ స్టోరీ నడుస్తుంది. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు.
అందుకే దాన్ని వదులుకోలేదు…
నేను చేసిన సినిమాల్లో ఎక్కువగా లవ్ స్టోరీలు ఉన్నా కథలు అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివి. అయితే ఇకనుండి లవ్ స్టోరీలు తగ్గిద్దామని అనుకున్నాను. కానీ ‘రంగ్ దే’ కథ విన్నాక చివరి లవ్ స్టోరీగా ఆ మూవీ చేస్తున్నాను. ఆ కథ చాలా బాగుంటుంది. అందుకే దాన్ని వదులుకోలేదు.
వినూత్నమైన సినిమా చేయాలని…
నేను ఇండస్ట్రీకి వచ్చి 18 సంవత్సరాలు అయింది. నా కెరీర్ గ్రాఫ్ కూడా చాలా వేరియేషన్స్‌తో సాగింది. మంచి అనుభూతి ఇది. ఇక నేను కూడా వినూత్నమైన సినిమా చేయాలని ఉద్దేశ్యంతోనే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో ఓ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా చాలా కొత్తగా ఉంటుంది.
నెక్ట్స్ మూవీస్…
మేర్లపాక గాంధీతో ఓ సినిమా చేయబోతున్నాను. జూన్ నుండి ఆ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. కృష్ణ చైతన్యతో ‘పవర్ పేట’ సినిమా కూడా ఆగస్ట్ నుండి మొదలవుతుంది. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్‌దే’, చంద్ర శేఖర్ యేలేటితో ఓ సినిమా చేస్తున్నాను.

Hero Nithin Special Interview release before Bheeshma

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News