Monday, April 29, 2024

తన వ్యక్తిగత భద్రతపై పవన్ సంచలన ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

కాకినాడ: తన వ్యక్తిగత భద్రతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడలో నిన్న రాత్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలతో పవన్ సమావేశమైన సందర్భంగా తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌ కిల్లర్‌ ముఠాలు అతడిని ప్రత్యేకంగా టార్గెట్‌ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ముందుజాగ్రత్త చర్యగా పార్టీ నేతలు, జనసైనికులు, ధీర మహిళలు భద్రతా నియమావళిని కచ్చితంగా పాటించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

జనసేన పార్టీ బలాన్ని చాటుతూ, రాబోయే ఎన్నికల్లో తాము క్లీన్ స్వీప్ చేస్తామని పవన్ కళ్యాణ్ ధీమాగా ప్రకటించారు. కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జనసైనికులు, వీరమహిళలపై దాడికి పాల్పడిన గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి వెనక్కి తగ్గబోమని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు. రానున్న ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీ గెలవకూడదని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News