Monday, April 29, 2024

మరో రెండు భారీ హెచ్‌ఎండిఎ లే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మరో రెండు లే ఔట్లను హెచ్‌ఎండిఏ అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా వచ్చేనెల నుంచి మేడిపల్లి, బాచుపల్లిలో లే ఔట్‌లోని ప్లాట్లను విక్రయించాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, ఉత్తరాన బాచుపల్లిలో రెండు భారీ లే ఔట్లను అభివృద్ధి చేసి, ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు హెచ్‌ఎండిఏ కసరత్తు చేస్తోంది. ఈ లే ఔట్లతో ఆధునిక మౌలిక వసతులను హెచ్‌ఎండీఏ కల్పిస్తోంది. ఈ రెండు లే ఔట్లు ఔటర్ రింగ్‌రోడ్డుకు అతి దగ్గరగా అత్యంత కీలకమైన ప్రాంతాలైన బాచుపల్లి, మేడిపల్లిలో విశాలమైన స్థలాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు ఎంతో అనుకూలంగా ఉండటంతో హెచ్‌ఎండిఏ మాస్టర్‌ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా లే ఔట్‌ను రూపొందిస్తున్నారు.

వరంగల్ జాతీయ రహదారికి అర కిలోమీటర్ దూరంలో మేడిపల్లి రెవెన్యూ పరిధిలో 55 ఎకరాల్లో, మరో లే ఔట్‌ను మియాపూర్ ఎక్స్‌రోడ్డు నుంచి గండి మైసమ్మ వెళ్లే మార్గంలో బాచుపల్లి ప్రాంతంలో 27 ఎకరాల స్థలంలో లే ఔట్‌లను హెచ్‌ఎండిఏ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్లాట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు హెచ్‌ఎండిఏ ఇటీవల నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మార్చి 2,3 తేదీల్లో బాచుపల్లి, మార్చిన 6వ తేదీన మేడిపల్లిలోని ఈ ప్లాట్లను వేలం వేయనుంది. ఈ వేలాన్ని ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్‌లైన్ వేలాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్‌టిసికి బాధ్యతలు చేపట్టిందని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, నిర్ణయించిన తేదీల్లో ఆయా సైట్ల వద్ద ఫ్రీ బిడ్డింగ్ ఉంటుందని హెచ్‌ఎండిఏ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News