- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇటీవల రెండో సారి ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం కుదుట పడడంతో గురువారం ఆస్పత్రినుంచి డిశ్చార్జి చేశారు. గత ఆగస్టు 2న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గుర్గామ్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే తిరిగి అనారోగ్యంతో ఎయిమ్స్లో చేరి కోలుకున్నారు. తిరిగి వారాల వ్యవధిలోనే మళ్లీ శ్వాస సమస్యలతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Home Minister Amit Shah discharged from AIIMS
- Advertisement -