Monday, April 29, 2024

వివాహేతర సంబంధం… భర్తను చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

A Man Murdered in Ranga Reddy

 

అమరావతి: ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామంలో జరిగింది. మద్యానికి బానిసైన భర్తను పప్పు గుత్తితో కొట్టి హత్య చేసి అనంతరం చెట్టు ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీనివాస్ చౌదరి(36), సరిత(33) అనే దంపతులకు ఏడేళ్ల కూతురు ఉంది.  భార్య ప్రభాకర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో దంపతుల మధ్య రోజు గొడవలు జరిగేవి. ప్రతి రోజులు తాగొచ్చి భార్యతో గొడవకు దిగేవాడు. గత రాత్రి తాగొచ్చి భార్యతో భర్త గొడవ పెట్టుకున్నాడు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో మద్యం మత్తులో ఉన్నభర్తను పప్పుకాడతో తలపై గట్టిగా కొట్టింది. వెంటనే శ్రీనివాస్ కుప్పకూలిపోవడంతో భర్త చనిపోయాడని గ్రహించిన భార్య…. అతడి శవాన్ని చెట్టుకు వేలాడిదీసింది. అనంతరం తన భర్త ఉరేసుకున్నాడని గ్రామస్థులను నమ్మించింది.  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి  సరితపై అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన కొడలు ప్రియుడు ప్రభాకర్ తో కలిసి భర్తను చంపించిందని ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News