Sunday, May 19, 2024

తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

 Huge Devotees visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. నిన్న శ్రీవారిని 37,627మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 15,086మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.3.54కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా వ్యాక్సిన్ లేనిపక్షంలో కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ను తమ వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని టిటిడి అధికారులు సూచించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని వారు పేర్కొన్నారు.మరోవైపు శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను సోమవారం ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు జనవరి కోటాను టిటిడి విడుదల చేయనుంది.

 Huge Devotees visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News