Saturday, April 27, 2024

వేముల‌వాడ‌ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..

- Advertisement -
- Advertisement -

Huge devotees visit Vemulawada Rajanna Temple

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వేముల‌వాడ‌ రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున్న భక్తులు పోటెత్తారు. మంగళవారం రాజన్న ఆలయం క్షేత్రంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు రాజన్న ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. టిటిడి దేవస్థాన బృందం కూడా రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించనుంది. కాగా, శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక, భక్తుల కోసం వేముల‌వాడ ప‌రిస‌ర ప్రాంతాల నుంచి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచారు.

Huge devotees visit Vemulawada Rajanna Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News