Monday, April 29, 2024

రూ.3.30 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం విజయం సా ధించిందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ పే ర్కొన్నారు. ఈ ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, పారదర్శక పాలనతో పాటు టి ఎస్ ఐపాస్‌తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి వ చ్చిన పెట్టుబడులతో పాటు భవిష్యత్‌లో రానున్న పె ట్టుబడులపై పరిశ్రమలు, -ఐటి అధికారులతో కెటిఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ 2014 నుంచి గత నెల నవంబర్ వరకు దాదాపు (40 బిలియన్ డాలర్‌లు) 3 లక్షల 30 వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ వివరాలు కేవలం టిఎస్ ఐపాస్, ఐటి-ఐటి అనుబంధ రంగాల్లో వచ్చిన పెట్టుబడుల వివరాలు మాత్రమేనని కెటిఆర్ తెలిపారు.

మైనింగ్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగంతో పాటు ఇతర రంగాల్లోకి వచ్చిన పెట్టుబడులను కలిపితే ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఆయా రంగాల్లోకి వచ్చిన పెట్టుబడుల వివరాలను కూడా వెల్లడిస్తామని కెటిఆర్ తెలిపారు. ఈ మేరకు వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని రాష్ట్రంలో ఇప్పటిదాకా వచ్చిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పెట్టుబడులతో ఇరవై రెండున్నర లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలిగిందని కెటిఆర్ పేర్కొన్నారు.
14 రంగాలు ప్రాధాన్యత….
ఒకటి, రెండు రంగాలకే కాకుండా దాదాపు 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా తమ ప్రభుత్వం గుర్తించి పక్కా ప్రణాళికను రూపొందించి, భారీ పెట్టుబడులను సాధించామని కెటిఆర్ తెలిపారు. ఒక్కో రంగానికి ప్రత్యేకంగా అధికారిని నియమించడంతో పాటు ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్న కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు నిర్వహించామన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఇక్కడి మౌలిక వసతుల గురించి వివరించడంతోనే అనేక రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో విజయం సాధించిన పరిశ్రమలు-, ఐటి శాఖలోని ప్రతి ఒక్క అధికారికి, వారి టీమ్ స్పిరిట్‌కు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు.

తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ల నుంచే పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ప్రత్యేకమైన వ్యూహాంతో ముందుకు పోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారని కెటిఆర్ తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రభుత్వ పాలసీలను రూపొందించడంతో పాటు అవసరమైన పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనను తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావించామని ఆయన తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలోకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు కెటిఆర్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడులతో లక్షలాది మందికి ఉపాధి దక్కడం తనకు సంతృప్తి కలిగిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎన్నో ఏళ్ల్లుగా అగ్రస్థానంలో ఉన్న దేశంలోని ఇతర నగరాలను హైదరాబాద్ దాటిన విషయాన్ని కెటిఆర్ గుర్తుచేశారు.
భవిష్యత్‌లోనూ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని మంత్రి కెటిఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆ దిశగా ముందుకు పోవాలని అధికారులకు దిశా, నిర్ధేశం చేశారు. దీంతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రానున్న సంవత్సర కాలానికి చేపట్టనున్న వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టిఎస్‌ఐఐసీ ఎండి వెంకట నరసింహారెడ్డి, వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమల శాఖ, ఐటి శాఖ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News