మల్యాల: భార్య, ఆమె ప్రియుడు తరచూ వేధించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ధరూర్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు మల్యాల ఎస్ఐ నాగరాజు బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన అట్టపెల్లి రాజుకు బొంకూరు గ్రామానికి చెందిన రమ్యతో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. కాగా పెళ్లికి ముందే రమకు తుంగూరు గ్రామానికి చెందిన సప్ప రాజేందర్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉందని రమ్య భర్త రాజుకు తెలియడంతో సక్రమంగా ఉండాలని రమ్యను మందలించాడు. కానీ రమ్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. తన ప్రియుడు రాజేందర్ వల్ల గర్భం వచ్చిందని రాజుకు చెప్పి, పుట్టింటికి వెళ్లి రమ్య అబార్షన్ చేయించుకుంది. రమ్య, ఆమె ప్రియుడు రాజేందర్ ఇద్దరు రాజును నువ్వు చచ్చిపో, భూమి మీద ఎందుకు బ్రతికి ఉన్నావని నిందిస్తూ తరచూ ఫోన్ చేసి వేధించారు. వారి వేధింపులు తాళలేక మనోవేదనకు గురైన రాజు నూకపల్లి గ్రామ శివారులో గల వరద కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. మృతుడి తండ్రి నాగయ్య ఫిర్యాదు మేకు రమ్య, రాజేందర్లపై కేసు నమోదు చేసిన విచారణ చేపట్టినల్లు మల్యాల ఎస్ఐ నాగరాజు తెలిపారు.
Husband commits suicide with wife-boyfriend abuse