Thursday, May 9, 2024

ఎపిలో కొత్తగా 253 పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

253 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటలలో 30,716మందికి పరీక్షలు చేయగా, కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.కరోనాతో రాష్ట్రంలో మరో వ్యక్తి చనిపోయినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 8 లక్షల 92వేలకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారిసంఖ్య 7,186కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,694 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 137 మంది కోలుకోగా.. ఇప్పవటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8లక్షల 83 వేలకు పైగా కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోటీ 46 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

253 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News