Saturday, April 27, 2024

పప్పు కూర వండలేదని…. భర్త కత్తిపీట మీద పడి…

- Advertisement -
- Advertisement -

Husband dead over drinking in Andhra Pradesh

అమరావతి: పప్పుకూర వండలేదని గొడవ పడుతూ కతిపీట మీద పడి భర్త మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్ శ్రీను- రూపావతి అనే దంపతులు లంకవీధిలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి కూతురికి పెళ్లి చేశారు. శ్రీను మద్యానికి బానిస కావడంతో రోజు భార్యతో గొడవపడేవాడు. శనివారం సాయంత్రం భోజనం చేస్తుండగా వంకయ కూరతో అన్నం పెట్టింది. వంకయ కూర వద్దు పప్పు కూర వండమని చెప్పాను కదా అని భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. పప్పు కూత వండుతానని ఆమె వంట గదిలో వెళ్లింది. ఆమెతో పాటు వంటి గదిలోకి వెళ్లిన భర్త తాగిన మైకంలో కత్తిపీట మీద పడ్డాడు. కూరగాయలు కోసే కత్తి వీపునకు గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఎస్‌ఐ బాలాజీరావు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఐ లక్ష్మణరావు కూడా ఘటనా స్థలానికి చేరుకొని వాకబు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News