Monday, April 29, 2024

సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తా: ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సరైన సమయంలో తన నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. భాకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి వేటుపడిన మాజీమంత్రి ఈటల రాజేందర్ తన భవిష్యత్ నిర్ణయం గురించి హుజుర్‌నగర్ నియోజకవర్గంలోని నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు రోజులుగా వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ప్రజాప్రతినిధులు వచ్చి తనకు సంఘీభావం ప్రకటించారని అన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటామని మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. అమెరికా నుంచి కూడా సంఘీభావం ప్రకటించారని, పలు సలహాలు సూచనలు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ క్రోడీకరించి సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.

I’ll announce future plan soon: Etela Rajender

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News