- Advertisement -
ఢిల్లీ: భారత్ లో కరోనా కలవర పెడుతోంది. రోజు రోజుకు భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో భారత్ లో 89,706 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1115 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 43.7 లక్షలకు చేరుకోగా 73,890 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 33.98 లక్షల మంది కోలుకోగా 8.93 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం 11.54 లక్షల మందికి టెస్టులు చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు భారత్ లో 5.18 కోట్ల మందికి టెస్టులు చేశామని ఐసిఎంఆర్ తెలిపింది.
- Advertisement -