Sunday, April 28, 2024

టీమిండియాకు జరిమానా..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్‌: టీమిండియాకు ఐసిసి జరిమానా విధించింది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా టీమిండియాకు జరిమానా పడింది. నిర్ణీత సమయంలో ఒక ఓవర్‌ తక్కువగా వేయడంతో‌ టీమిండియా మ్యాచ్‌ ఫీజులో 20 శాతం ఫైన్‌ వేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టుపై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు ఒక్కో విజయంతో సమంగా నిలిచాయి. మంగళవారం జరగబోయే మూడో టీ20లో విజయం సాధించి సత్తా చాటాలని ఇంగ్లండ్, భారత్ జట్లు పట్టుదలగా ఉన్నాయి.

India fined for Slow over rate in 2nd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News