Thursday, May 9, 2024

పంత్ హాఫ్ సెంచరీ… టీమిండియా 130/4

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: న్యూలాండ్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు భారత్ జట్టు 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 130 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా ఇప్పటివరకు 143 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. రిషబ్ పంత్ 60 బంతుల్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(28), రిషబ్ పంత్ (51) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బ్యాట్స్‌మెన్లలో కెఎల్ రాహుల్ (10), మయాంక్ అగర్వాల్(07), ఛటేశ్వరా పూజారా(09), అంజిక్య రహాన్ (01) పరుగులు చేసి మైదానం వీడారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా, మార్కో జన్‌సేన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భారత్-సౌతాఫ్రికా చెరో ఒక మ్యాచ్ గెలించి సమంగా ఉన్నారు.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 210
ఇండియా తొలి ఇన్నింగ్స్: 223

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News