Wednesday, May 1, 2024

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు..

- Advertisement -
- Advertisement -

India Reports 12885 new Corona Cases in 24 hours

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,885 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 461 మంది మృతిచెందినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,21,025కోట్లకు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 4,59,652మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, గత 24 గంటల్లో 15,054 మంది కరోనా నుంచి కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు 3,37,12,794కోట్ల బాధితులు కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,48,579 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో దేశంలో 252రోజుల్లో ఇంత తక్కువ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 107.63కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.

India Reports 12885 new Corona Cases in 24 hours

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News