Saturday, May 18, 2024

దేశంలో మరో 2,67,334 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

India reports 267334 new Covid-19 cases

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కానీ మరణాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 2,67,334 మందికి కరోనా సోకింది. 3,89,851 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, ఒకే రోజులో అత్యధికంగా 4529 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 2,54,96,330కి చేరింది. ఇండియాలో ఇప్పటివరకు 2,19,86,363 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా 2,83,248 మందిని కరోనా కబలించింది. భారత్ లో ప్రస్తుతం 32,26,719 కరోనా క్రియాశీల కేసులున్నాయి. దేశంలో  మొత్తం 18,58,09,302 మందికి కరోనా టీకాలు వేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. 20 మే 2021 వరకు 32,03,01,177 నమూనాలను పరీక్షించారు. వీటిలో 20,08,296 మందికి కరోనా టెస్టులు చేసినట్టు ఐసిఎంఆర్ వెల్లడించింది.

India reports 267334 new Covid-19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News