Saturday, May 4, 2024

దేశంలో మరో 3,92,488 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

India reports 392488 new COVID-19 cases

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,92,488 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తాజాగా 3,689 మంది మరణించారు. అదే సమయంలో 3,07,865 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,95,57,457కి పెరిగింది. ఇప్పటివరకు 1,59,92,271మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో 2,15,542 మంది కరోనాతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా 33,49,644 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. భారత్ లో మొత్తం 15,68,16,031 మందికి కోవిడ్-19 టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. 2021 మే 1 వరకు 29,01,42,339 నమూనాలను పరీక్షించారు. వీటిలో నిన్న 18,04,954 నమూనాలను పరీక్షించినట్టు ఐసిఎంఆర్ వెల్లడించింది.

India reports 392488 new COVID-19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News