న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్తో భారత సంతతికి చెందిన మీడియా ప్రతినిధి బ్రహ్మ కంచిబొట్ల (66) చనిపోయాడు. కరోనాతో బ్రహ్మ ఐసియులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. న్యూయార్క్ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అనే మీడియా సంస్థలో కరెస్పాండెంట్గా పని చేస్తున్నారు. బ్రహ్మ మృతిపట్ల అమెరికా మీడియా వర్గాలు సంతాపం తెలిపాయి. బ్రహ్మ కరోనా సోకిందని తెలియగానే తన నివాసంలో హోంక్యారంటైన్లో ఉంటున్నాడు. అతడు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడడంతో స్థానిక ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటలెటర్పై ఉంచి వైద్యులు చికిత్స చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రహ్మ కన్నుమూశాడు. అంత్యక్రియల కోసం తన తండ్రి మృతదేహాన్ని ఇస్తారో లేదోనని ఆయన తనయుడు సుడామా కంచిబోట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. బ్రహ్మకు భార్య అంజన, కూతురు సుజన, కుమారుడు సుడామా ఉన్నారు. అమెరికాలో కరోనా వైరస్ 3,67,650కి సోకగా 10,943 మంది మృత్యువాతపడ్డారు.
ప్రపంచం | కరోనా రోగుల సంఖ్య | మృతులు | కోలుకున్నవారు |
ప్రపంచం | 1,359,010 | 75,901 | 293,454 |
అమెరికా | 367,650 | 10,943 | 19,810 |
స్పెయిన్ | 140,510 | 13,798 | 43,208 |
ఇటలీ | 132,547 | 16,523 | 22,837 |
జెర్మనీ | 103,375 | 1,810 | 36,081 |
ఫ్రాన్స్ | 98,010 | 8,911 | 17,250 |
చైనా | 81,740 | 3,331 | 77,167 |
ఇరాన్ | 62,589 | 3,872 | 27,039 |
యుకె | 51,608 | 5,373 | 135 |
టర్కీ | 30,217 | 649 | 1,326 |
బెల్జీయం | 22,194 | 2,035 | 4,157 |