- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసులు 46 లక్షలు దాటాయి. భారత్ లో ఒకేరోజు అత్యధికంగా 97వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. గత 24గంటల్లో 97,570 మందికి కొత్తగా కోవిడ్-19 సోకగా.. 1,201 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 46,59,985కి పెరిగింది. ఇండియాలో ఇప్పటివరకు 77,472 మందిని కోవిడ్ కబలించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 9,58,316 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మహమ్మారి నుంచి 36,24,197 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.
India’s COVID 19 case tally crosses 46 lakh mark
- Advertisement -