Saturday, April 27, 2024

లక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఇంద్రకరణ్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: జిల్లాలోని కీసర మండలం చీర్యాలలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి చతుర్ధశ(14వ) వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సుభాష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Indrakaran Reddy visit Lakshmi Narasimha Swamy in Cheeryal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News