Saturday, April 27, 2024

యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాద కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం, బంగారం, వెండి నాణేల( డాలర్) విక్రయాన్ని కేంద్రాన్ని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..3 గ్రాముల బంగారం డాలరు రూ.21,000/, 5 గ్రాములు వెండి రూ.1,000/ 80 గ్రాముల మిల్లెట్ ప్రసాదం రూ.40./ నిర్ణయించినట్లు తెలిపారు. అంతే కాకుండా భక్తుల సౌకర్యం కోసం వెబ్ పోర్టల్ ను ఆవిష్కరించడమే కాకుండా ఆన్ లైన్ టికెట్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వృద్దులు, వికలాంగుల కోసం రూ.21 లక్షల వ్యయంతో 3 బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు.

అంతకుముందు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈఓ, అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి ప్రధాన ఆలయంలో స్వయంబు దేవుడిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు మంత్రిని ఆశీర్వదించగా, ఆలయ ఈవో శ్రీస్వామివారి ప్రసాదాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News