దుబాయ్: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా లీగ్ దశలో మరో రసవత్తర పోరు జరగనుంది. మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, చెన్నై జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ లో కేవలం 4 మ్యాచ్ లోనే గెలుపొంది పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. మరోవైపు, కోల్కతా జట్టు ఆడిన 12 మ్యాచ్ లో 6 మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. పంజాబ్ జట్టు కూడా 6 మ్యాచ్ లో గెలిచి 12 పాయింట్లు సాధించింది. అయితే, పంజాబ్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో పాయింట్ల పట్టికలో నాలుగోవ స్థానంలో నిలిచింది. దీంతో కోల్కతా ప్లేఆఫ్ రేసులో నిలువాలంటే ఈ మ్యాచ్ లో చెన్నైపై భారీ తేడాతో విజయం సాధించాలి.
IPL 2020: CSK Win Toss and Opt Bowl against KKR