Saturday, April 27, 2024

ఐపిఎల్ 2021లో బోణీ కొట్టిన హైదరాబాద్..

- Advertisement -
- Advertisement -

IPL 2021: SRH win by 9 wickets against PBKS

చెన్నై: ఐపిఎల్‌ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణి కొట్టింది. బుధవారం సాయంత్రం చెపాకా స్టేడియం వేదకగా జరిగిన మ్యాచ్‌లో‌ సన్‌రైజర్స్, పంజాబ్‌ జట్టుపై 9వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ బెయిర్ స్టో అజేయ అర్థశతకంతో జట్టుకు విజయాన్ని అందించాడు. పంజాబ్ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్(37), బెయిర్ స్టో(63)లు శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ విజయం దిశగా వెళ్తున్న సమయంలో వార్నర్ భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన విలియమ్సన్(16) తో కలిసి బెయిర్ స్టో మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించాడు. దీంతో సన్ రైజర్స్ జట్టు 18.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 121 పరుగుల చేసి తొలి విజయాన్ని అందుకుంది.

IPL 2021: SRH win by 9 wickets against PBKS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News