Thursday, May 9, 2024

IPL 2023: అక్షర్ మెరుపులు.. ముంబై టార్గెట్ 173

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీః అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్ జట్టు, ముంబై ఇండియన్స్ కు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టు 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది.

ఓపెనర్ డేవిడ్ వార్నర్(51), అక్షర్ పటేల్(54: 25 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సులు) అర్థ శతకాలతో రాణించారు. మనీష్ పాండే(28) పర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండోర్ఫ్, పియూష్ చావ్లాలు మూడేసి వికెట్లు పడగొట్టగా.. రిలే మెరెడిత్ రెండు వికెట్లు, హృతిక్ ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News