Monday, April 29, 2024

IPL 2023: రాజస్థాన్ పై బెంగళూరు విజయం..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపొందింది. బెంగళూరు నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేసింది.

ఓపెనర్ యశస్వి జైస్వాల్(47), దేవ్‌దూత్ పడిక్కల్(52), సంజూ శాంసన్(22), దృవ్ జురెల్(34 నాటౌట్)లు రాణించినా.. రాజస్థాన్ టార్గెట్ ను చేధించలేకపోయింది. కీలక సమయంలో బౌలర్లు చెలరేగడంతో బెంగళూరు, రాజస్థాన్ జట్టుపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News