Saturday, May 11, 2024

IPL 2023: చెన్నై లక్ష్యం 203

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్ 2023లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 203 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు ఓపెనర్లు జోస్ బట్లర్(27), జైశ్వాల్(77)లు శుభారంభాన్ని అందించారు.

ముఖ్యంగా జైశ్వాల్ మెరపు బ్యాటింగ్ అర్థ శతకాన్ని సాధించి, జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లలో దేవ్‌దత్ పడిక్కల్(23 నాటౌట్), దృవ్ జురెల్(34) చెలరేగడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News