Thursday, May 9, 2024

IPL 2024: ఆండ్రూ రస్సెల్ విధ్వంసం.. సన్రైజర్స్కు భారీ టార్గెట్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రస్సెల్.. భారీ బౌండరీలతో సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

కేవలం 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్సులతో అజేయంగా 64 పరుగులు చేశాడు రస్సెల్. ఇక, ఓపెనర్ ఫిలిప్‌ సాల్ట్‌(54) అర్థశతకంతో రాణించాడు. దీంతో కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News