Saturday, April 27, 2024

యుపిఐ పేమెంట్స్‌లోకి జియో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని దిగ్గజ టెలికాం సంస్థ జియో డిజిటల్ పేమెం ట్స్ రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఈ విభాగంలో జియో ప్రవేశంతో పేటీ ఎం, ఫోన్‌పే వంటి పెద్ద సంస్థలు గట్టి పోటీని ఎదుర్కోబోతున్నాయి. టెలికాం రంగంలోకి ప్రవేశించిన సమయంలో జియో ఉచిత సేవలతో సంచలనం సృష్టించింది. దీంతో మూడు పెద్ద టెలికాం సంస్థలు తప్ప మిగతా వారంతా తమ సేవలను నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పుడు జియో రిటైల్ అవుట్‌లెట్లలో సౌండ్‌బాక్స్‌ను అందించడం ప్రారంభించింది. పేటీఎం సౌండ్‌బాక్స్‌కి ఇది ప్రత్యక్ష సవాలు కానుంది. యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)లో జియో పెద్ద సంస్థగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

జియో సౌండ్‌బాక్స్ ట్రయల్
ముకేశ్ అంబానీ జియో పే యాప్ సేవకు సౌండ్‌బాక్స్ చేరికతో యుపిఐ చెల్లింపు విభాగంలో కంపెనీ వేగం పెరుగుతుంది. నివేదిక ప్రకారం, జియో సౌండ్‌బాక్స్ ట్రయల్‌ను ప్రారంభించింది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే ఇప్పటికే ఈ విభాగంలో మంచి మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. అయితే పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ చర్య కారణంగా ఈ సంస్థ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. డిజిటల్ చెల్లింపుల విభాగంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు జియో వేగంగా అడుగులు వేయడం ప్రారంభించింది. దుకాణదారులకు కంపెనీ మంచి ప్రోత్సాహకాలు కూడా ఇస్తోంది.

పేటీఎం సంక్షోభంతో అవకాశం..
పేటీఎం సంక్షోభం కారణంగా జియో ముందుకు సాగడానికి మంచి అవకాశం లభించిందని నివేదిక చెబుతోంది. జియో నిర్ణయంతో ఇతర కంపెనీలు పోటీని పెంచడానికి సన్నద్ధమవుతున్నాయి. దాని ప్రస్తుత మౌలిక సదుపాయాలు, సాంకేతికత సహాయంతో యుపిఐ చెల్లింపు విభాగంలో ముందుకు సాగడానికి జియో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. డిజిటల్ చెల్లింపుల విభాగంలో కంపెనీ భారీ మార్కెట్ వాటాను సులభంగా సాధించగలదు. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విభాగం నిరంతరం పెరుగుతోంది. మరోవైపు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా తన యుపిఐ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News