Tuesday, March 19, 2024

విలియమ్సన్ ఔట్… కివీస్ 131/6

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: గ్రీన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు కివీస్ 72 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 131 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. న్యూజిలాండ్ 153 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉంది. కానీ టీమిండియా నాలుగు వికెట్లు తీస్తే విజయం సాధించవచ్చు. కెప్టెన్ విలియమ్సన్ 24 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ క్లీన్ బౌల్డయ్యాడు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు టామ్ లాథమ్ (52), విలియమ్ సోమర్ వెల్ (36), కెన్ విలియమ్స్(24), విల్ యంగ్ (02), రాస్ టేలర్ (02), నికోలస్(01) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో టామ్ బండెల్(02), రచిన్ రవీంద్ర(03) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 345
ఇండియా రెండో ఇన్నింగ్స్: 234
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 296

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News