Wednesday, May 1, 2024

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఎంఎల్‌సి కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 23 వరకు పొడిగించింది. మంగళవారంతో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో రౌస్ రెవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు ఆమెను ఇడి అధికారులు హాజరుపరిచారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ఇడి తరపు న్యాయవాది కోరారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసలో దర్యాప్తు కొనసాగుతుండడంతో మరో 14 రోజులు పొడిగించాలని కోర్టును ఇడి కోరింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడానికి ఇడి దగ్గర ఏమీ లేవని ఆమె తరుపు న్యాయవాది రానా కోర్టుకు తెలిపారు.

కవిత ప్రభావితం చేసే వ్యక్తి కాదని, గత రెండు సంవత్సరాల నుంచి దర్యాప్తు సాగుతోందని, కవిత కోర్టులో నేరుగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయడంతో జడ్జి నిరాకరించారు. ఇరువర్గాల వాదనలు విన్న తరువాత రౌస్ రెవెన్యూ కోర్టు కవిత జ్యూడీషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ తీర్పు వెల్లడించింది. కోర్టు అనుమతి ఇవ్వడంతో భర్త అనిల్, కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడారు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవిత అరెస్టు అయిన విషయం తెలిసిందే. పది రోజులు ఇడి కస్టడీలో ఉండగా 14 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News