- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీ) 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 20 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు, రెండో తరగతిలో ఈనెల 20 నుంచి 25లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రీయ విద్యాలయ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయినట్టు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తెలిపింది. 11వ తరగతి అడ్మిషన్లను ఖాళీ సీట్లను బట్టి భర్తీ చేస్తామని, ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని కేంద్రీయ విద్యాలయ అధికారులు పేర్కొన్నారు.
Kendriya Vidyalaya admission notification Released
- Advertisement -