- Advertisement -
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక పూజలు చేశారు. మహాగణపతిని పలువురు ప్రముఖులు హర్యానా దత్తాత్రేయ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్ఎ దానం నాగేందర్ తదితరులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళి సై వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వాక్సినేషన్తోనే కరోనాను కట్టడి చేయగలమన్నారు. తప్పకుండా కరోనాపై విజయం సాధిస్తామన్నారు. తొలి రోజు ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకోవడానిక భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
- Advertisement -