Sunday, April 28, 2024

రేవంత్ కు రైతులంటే చిన్నచూపు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకింత చిన్నచూపు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. తన ఎక్స్ లో కెటిఆర్ ట్వీట్ చేశారు. నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, నేడు వడగండ్లు వాన ముంచెత్తినా పంట పొలాలవైపు కన్నెత్తి చూడటంలేదని దుయ్యబట్టారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే సరిపోతుందని, గల్లీలో రైతుల కన్నీళ్లు ఎప్పుడు తుడుస్తారని ప్రశ్నించారు. అన్నదాతల ఆర్థనాదాలు వినిపించడం లేదా?, పార్లమెంట్ ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా? అని కెటిఆర్ అడిగారు.

ప్రజా పాలన అంటే 24/7 ఫక్తు రాజకీయమేనా? అని చురకలంటించారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంటనష్టంపై ఎందుకు లేదు అని అడిగారు. పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా?, హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ,  రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? ఎద్దేవా చేశారు. ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా ఎందుకు సాగునీరు ఇవ్వడం లేదని నిలదీశారు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలంటే రేవంత్ కు మనసు రావడం లేదా? అని కెటిఆర్ దమ్మెత్తిపోశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News