- Advertisement -
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇకపై ప్రతి ఆదివారం.. ఉదయం పది గంటలకు పదినిమిషాలు పేరుతో సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ నగరంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంపిలు, ఎంఎల్సిలు, ఇతర ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీలు, మురికాడలు, బస్తీల్లో ఎక్కడా నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ఇతరులకు స్పూర్తిగా నిలవాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
KTR will begins Every Sunday 10 mins to 10 hrs Program
- Advertisement -