Saturday, April 27, 2024

కాళేశ్వరం జలానికి లక్ష జనహారతి

- Advertisement -
- Advertisement -

వేడుకలో లక్ష్యానికి మించి హాజరైన రైతులు, ప్రజలు
వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డు నమోదు
నిర్వాహకులు మంత్రి జగదీశ్‌రెడ్డికి మెమొంటో, ప్రశంసా అందజేసిన ప్రతినిధులు
మన తెలంగాణ/ చివ్వెంల: బీడు భూములతో దర్శనమిచ్చే సూర్యాపేట జిల్లాకు కెసిఆర్ కాళేశ్వరం జలాలను మొదటగా అందించి సస్యశ్యామలం చేసిన విష యం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సిఎం కెసిఆర్‌కు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపేందుకు కాళేశ్వరం జలాలకు లక్షమందితో స్వాగత హారతి ఇచ్చి స్వాగతం పలికే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గత వారం రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధులతో వివిధ దఫాలుగా సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచలను చేశారు. జిల్లాలో నాగారం మండలం ఈటూరు నుంచి చివరగా కాళేశ్వరం జలాలు చేరే పెన్‌పహడ్ వరకు ఎస్ ఆ ర్‌ఎస్‌పి కాల్వల వెంట రైతులు, ప్రజలు లక్ష జనహారతి ఇచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించారు.

బుధవారం కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు 68 కిలోమీటర్ల మేర ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేస్తూ ఒకే సమయంలో కాళేశ్వరం జలాలకు హారతులు, స్వాగతం పలికే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డులు ప్రతినిధులు మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు కార్యక్రమం నిర్వహిస్తున్న ఆరు మండలాల్లో పర్యటించి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల సంఖ్యను గుర్తించారు. లక్ష మందితో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా మండలాల వారీగా నాగారం మండలంలో 18,137 మంది, జాజిరెడ్డిగూడెం 18,148, ఆత్మకూర్(ఎస్) 19,677, సూర్యాపేట 19,881, చివ్వెంల 20,239, పెన్‌పహడ్ మండలంలో 20,060 మందితో ఈ ఆరు మండలాల్లో లక్ష 16 వేలకు పైగా మంది కార్యక్రమంలో పాల్గొన్నట్లు వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డు ప్రతినిధులు గుర్తించినట్లు తెలిపారు.

దీంతో కార్యక్రమం వేదికపై వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డు ప్రతినిధులు నరేందర్ గౌడ్, గంగాధర్‌లు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని శాలువాలతో సన్మానించి మెమోంటో, ప్రశంసా పత్రంతో పా టు మెడల్‌ను అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి విజయంతం చేసేందుకు కృషి చేసిన కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్‌లను సన్మానించి మెమోటో, మెడల్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, జడ్పి సిఇవో సురేశ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఎంపీపీ కుమారిబాబు నాయక్, జడ్పిటిసి భూక్యా సంజీవ్ నాయక్, వైస్ ఎంపిపి జీవన్ రెడ్డిలు పాల్గొన్నారు.

నా కష్టానికి ఫలితం దక్కింది:మంత్రి జగదీష్‌రెడ్డి
వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డులో చోటు లభించడం చాలా సంతోషంగా ఉం దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గిన్నిస్ బుక్ రికార్డ్ పత్రం అందుకున్న సందర్బంగా మాట్లాడుతూ మొదటి సారిగా అవకాశం ఇచ్చిన శ్రీరామ్ సాగర్ జలాలకు లక్ష జన హారతికి వందనాలలు అన్నారు. సభా వేదికపై మ నోభావాన్ని ప్రకటించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిమాట్లాడుతూ సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు,నాయకులకు,కార్యకర్తలకు,రైతులకు, మహిళలకు,ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News