Saturday, April 27, 2024

మద్యం దుకాణంలో చోరీ

- Advertisement -
- Advertisement -

Liquor worth Rs 70000 stolen from wine shop

రంగారెడ్డి: ఆమనగల్లు పట్టణ సమీపంలోని విఠాయిపల్లిలోని మద్యం దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుకాణం వెనక భాగం నుంచి ఉన్న రేకును, ఇనుప చువ్వలను తోలగించి మద్యం అపహరించారు. షాప్ యాజమాని ఆకుతోట శ్రీనివాస్, రేగట్టే శ్రీను తెలిపిన వివరాల ప్రకారం… ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిని అనుసరించి ఉన్న దుర్గావైన్స్‌ను నిర్వాహకులు రోజు మాదిరిగానే గురువారం రాత్రి వ్యాపారాన్ని ముగించుకోని దుకాణానికి తాళం వేసి వెళ్లిపోయారు.

శుక్రవారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం వెనక భాగంలో ఉన్న రేకులను తోలగించి కట్టర్‌తో ఇనుపచువ్వలను కట్ చేసి దుకాణంలోకి చోరబడి సుమారు 70 వేల రూపాయల విలువైన కాస్లీ మద్యాన్ని ఎత్తుకెళ్లాడు. మద్యంతో పాటు దుకాణంలో ఉన్న 2 సిసి కెమెరాలు, ఒక టి.వి, హర్డ్‌డిస్క్ (డివిఆర్), వైఫై రూటర్‌ను ఎత్తుకెళ్లినట్లు యజమానులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. మద్యం దోంగలను త్వరలో పట్టుకుంటామని ఆమనగల్లు ఎసై పి. ధర్మేష్ తెలిపారు. ఈ దోంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వైన్స్ యజమానులు ఆకుతోట శ్రీనివాస్, రేగట్టే శ్రీను తెలిపారు. గతంలో ఇదే వైన్ షాపులో రెండు సార్లు దొంగతనం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News