Monday, April 29, 2024

శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ ఓం బిర్లా

- Advertisement -
- Advertisement -

తిరుమల: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. స్పీకర్‌ ఓం బిర్లా సోమవారం రాత్రి 7.30 గంటలకు తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టిటిడి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం ఓం బిర్లా కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు ఓం బిర్లాకు స్వామివారి ప్రసాదంతోపాటు చిత్రపటాన్ని బహుకరించారు. తిరుమల పర్యటనలో భాగంగా ఓం బిర్లా మరికాసేపట్లో వేదపాఠశాలను సందర్శించనున్నారు.

Lok Sabha Speaker visits Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News