జమైకా: పాకిస్థాన్తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య వెస్టిండీస్ ఒక వికెట్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్లో 168 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. కీమర్ రోచ్ చిరస్మరణీయ పోరాటంతో విండీస్కు అద్భుత విజయాన్ని సాధించి పెట్టాడు. మరోవైపు పాకిస్థాన్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ మ్యాచ్ను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే వీరి ఆశలపై జర్మయిన్ బ్లాక్వుడ్, కీమర్ రోచ్ నీళ్లు చల్లారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్లాక్వుడ్ పది ఫోర్లతో 55 పరుగులు చేశాడు. జేసన్ హోల్డర్(16), వికెట్ కీపర్ జోషువా ద సిల్వా (13) కూడా తమ వంతు పాత్ర పోషించారు.
ఇక చివరల్లో ఒంటరి పోరాటం చేసిన రోచ్ రెండు ఫోర్లతో అజేయంగా 30 పరుగులు చేసి విండీస్కు సంచలన విజయం సాధించి పెట్టాడు. పాక్ బౌలర్లలో షాహిన్ నాలుగు, హసన్ అలీ మూడు, ఫహీం అశ్రఫ్ రెండు వికెట్లు పడగొట్టినా ఫలితం లేకుండా పోయింది. ఈ విజయంతో విండీస్ సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 20 నుంచి జరుగనుంది.
West Indies won by one wicket against Pakistan