- Advertisement -
మన తెలంగాణ/చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామా శివారులో గురువారం బియ్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. హుజురాబాద్ నుండి సుందరగిరి వైపు బియ్యం లోడుతో వెళ్తున్న లారీ రోడ్డుపై ఉన్న వరి ధాన్యం కుప్పలను తప్పించబోయి బోల్తా పడినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పిందని లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ఫ గాయపడినట్టు స్థానికులు తెలిపారు. రోడ్లపై వరి ధాన్యం ఆరబోయటం, కుప్పలు పోయకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు పోలీసులను కోరుతున్నారు.
- Advertisement -