Saturday, April 27, 2024

బతికి చచ్చిన ప్రియుడు…

- Advertisement -
- Advertisement -

 

 

మహబూబ్‌నగర్: ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న 20 రోజుల తరువాత ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపన్‌పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మధు(20) మూడు రోజుల క్రితం గుదిబండలోని తన పెద్దమ్మ ఇంటికి వచ్చాడు. అర్థరాత్రి సమయంలో ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున లేచేసరికి చెట్టుకు వెలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. 20 రోజుల క్రితం వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియురాలితో సదరు యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రియురాలు మృతి చెందగా ప్రియుడు కొనఊపిరితో బయటపడ్డాడు. ప్రియురాలు కనిపించకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News