- Advertisement -
మహబూబ్ నగర్: ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పడంతో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యువతి (15), యువకుడు(19) మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకున్నామని తన కుటుంబ సభ్యులకు తెలపడంతో ప్రేమ వివాహానికి వారు అడ్డు చెప్పారు. బతికి ఉంటే తమ కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోనివ్వరని కలిసి చనిపోదామని ఆ జంట శనివారం గ్రామ శివారులోని మామిడి తోటలో ఆ జంట ఉరేసుకున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నరేష్ తెలిపాడు.
- Advertisement -