- Advertisement -
భోపాల్ : మధ్యప్రదేశ్లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి ఉచితంగా టీకాలు వేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. బుధవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా నిర్ణయించింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగానే టీకాలు వేస్తామని, ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చత్తీస్గఢ్ సిఎం భూపేశ్ భగేల్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాలు ఇప్పటికే ఉచితంగా టీకా ఇవ్వడానికి నిర్ణయించాయి.
- Advertisement -