- Advertisement -
చెన్నై: తమిళనాడులో ఎంఎల్ఎ ప్రభు ప్రేమ పెళ్లి వివాదాస్పదమైంది. పెళ్లిపై యువతి తండ్రి స్వామినాథన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. తన కూతురిని కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడని యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన హైకోర్టు.. రేపు(శుక్రవారం) ఎంఎల్ఎ ప్రభు, సౌందర్య ఇద్దరూ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కళ్లకురిచ్చి నియోజకవర్గ ఎంఎల్ఎ ప్రభు(34), త్యాగదుర్గానికి చెందిన ఆలయ అర్చకుడు స్వామినాథన్ కూతరు సౌందర్య(19)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పెళ్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో తన కూతురిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని ఎంఎల్ఎపై స్వామినాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎంఎల్ఎ ప్రేమ పెళ్లి హైకోర్టుకు వెళ్లింది.
Madras HC Reacts on MLA’s Love Marriage
- Advertisement -