Monday, April 29, 2024

మహబూబ్ నగర్ లో వోల్వో బస్సుకు తప్పిన ప్రమాదం…. వీడియో

- Advertisement -
- Advertisement -

అడ్డాకుల: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల సబ్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారి 44పై శుక్రవారం ఉదయం వోల్వో బస్సుకు పెను ప్రమాదం తప్పింది.  ఎపి 39 యుక్యు 8584 నంబర్ గల వోల్వో బస్సు 30 మంది ప్రయాణికులతో కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ ప్రమాదం గమనించిన వెంటనే బస్సు రోడ్డు పక్కకు ఆపాడు. వెంటనే నీళ్లతో మంటలను ఆర్పేశాడు. డ్రైవర్ అప్రమత్తతతో 30 ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  బస్సుకు సంబంధించిన ముందు టైరు ఊడిపోవడంతోనే మంటలు చెలరేగాయని ప్రయాణికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News