- Advertisement -
నిందితున్ని అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లోని అమ్మాయిల ఫోటోలు సేకరిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ మోసగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహమ్మద్ హైమద్ ఇన్స్టాగ్రామ్లో అ మ్మాయిల ఫొటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసేవాడు. ఆ యువతుల ఫోన్ నంబర్ సేకరించి మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. ఈక్రమంలో నగరానికి చెంది ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. మహమ్మద్ వలలో పడి చాలా మంది యువతులు మోసపోయారని పోలీసులు విచారణలో తేలింది. మహమ్మద్పై తెలుగు రాష్ట్రాలలో అనేక కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు.
Man blackmailing women with morphed photos
- Advertisement -