Monday, April 29, 2024

బైక్ పై వెళ్తుండగా కరెంట్ వైర్ తెగి పడి వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిపై కరెంట్ తీగ పడి మృతి చెందిన ఘటన సోమవారం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మల్లంపేట ఆకాష్ లేఔట్ లో ద్విచక్ర వాహనంపై సత్యనారాయణ అనే వ్యక్తి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంటు వైర్ తెగి పడింది. దీంతో అతను ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మూగజీవమైన పంది కూడా మరణించింది.

స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News